ఈ రోజు (18-3-2015) నమస్తే తెలంగాణా పేపర్ లో వచ్చిన గటిక విజయకుమార్ గారి “వివాదాస్పద వ్యాఖ్యల విషాదం” వ్యాసం చాల అంశాలను ఎత్తి చూపెట్టే ప్రయత్నం చేసింది,
మొదట దీన్ని చదువుధాం.. http://epaper.namasthetelangaana.com/Details.aspx?id=302950&boxid=589845224
కాని ఎందుకో కొన్ని విషయాలను కావాలని వదిలిపెట్టినట్టు అనిపించింది...
దాంట్లో కొన్ని...
ఇటివల ఎం ఐ ఎం అధినేత అసదుద్దిన్ ఒవైసీ పుట్టిన ప్రతి ఒక్కరు ముస్లింలే కాని వాళ్ళ తల్లి దండ్రులు వాళ్ళని వేరే మతం లోకి మారుస్తున్నారు అనడం వివాస్పదం కాదా?
http://www.ndtv.com/india-news/every-indian-is-born-a-muslim-says-politician-asaduddin-owaisi-722735
నర రూప రాక్షసులకు ప్రతినిధి గ ఉన్న ఐసిస్ తీవ్రదులుతో కలిసి వాళ్ళ తోనే జీవిస్తాం, చస్తాం, ఈ దేశం మాది కాదు అని కొంతమంది యువకులు దేశ సరిహద్దులు దాటడం వివాస్పదం కాదా?
http://timesofindia.indiatimes.com/india/Engineers-among-9-ISIS-bound-Indians-deported-by-Turkey/articleshow/46079886.cms
ఈ పాపిష్టి భారత దేశంలో నేను బతకను అని చెప్పుతున్న యువత వెనుకల ఎవరు ఎన్నారు ?
ఒక ముల్లా శివుడు మొదటి ప్రవక్త అంటే అతడి తలకు వెల కట్టడం , వివాస్పదం కాదా?
పారిస్ లో జర్నలిస్ట్ లపై కాల్పులను సమర్దిస్తు ప్రార్థనలు జరిపిన ముల్లా, ఏది ఎక్కడో కాదు, మన హైదరాబాద్ లో ...మరి దీన్ని ఏమంటారో ....
ముంబై లో ఉన్న సైనికుల స్మారక స్తుపాల గౌరవం ఇవ్వద్దు అని చెప్పుతున్నఈ చర్యల వెనుకల ఎవరు ఉన్నారు?
ఎ దళం ఉంది? ఏ మతోన్మాదం ఉంది?
మన తెలంగాణా ప్రాంత రాజకీయ నాయకుడైన అక్బరుద్దీన్ ఒవైసీ 15 నిముషాలు చాలు హిందువుల అంతు చేస్తాం అని చెప్పడం ఎప్పటి నుంచో తన మస్తిష్కంలో గూడు కట్టుకున్న భావాలూ అనుకోవాలా ?
నరేంద్ర మోడీ తో కలిసి పతింగి ఎగురవేస్తే నే , తప్పు పట్టి సల్మాన్ ఖాన్ సినిమాలు చుడద్దు అని చెప్పడం ..వివాస్పదం కాదా ?
http://www.siasat.com/english/news/dont-buy-ticket-salmans-film-hyderabad-asad-owaisi
ఒక అమ్మాయి తన పుట్టిన రోజు నాడు బొట్టు పెట్టుకొని బడికి వస్తే అది నేరం కింద పరిగణిస్తారు అని చెప్పడం వివాస్పదం కాదా, లేదా పరమత సహనం అని బోధించడంమా ? ఏది ఎక్కడో కాదు, మన సికింద్రాబాద్, తార్నాక లోని సెయింట్ ఆన్స్ స్కూల్ లో ...మరి దీన్ని ఏమనాలి?
బడిలో పిల్లలకు బైబుల్ పంచడం వివాస్పదం కాదా? ఇది మన హైదరాబాద్ లోనే....
మదర్ తెరెసా గురుంచి లోకమంతా తెలుసు....చాల మంది ఆమె గురుంచి తప్పు పట్టారు....
మత గురువు , పెద్ద అయిన పొప్ గూడా చెప్పిండు ...సేవ అనేది అతి పెద్ద మతం మార్చే ప్రక్రియలో ఒక భాగం అని..మరి దీన్ని ఏమనాలి?
తిరుమల కొండ మీద కెక్కి జీసస్ గొప్ప అను చెప్పించింది ఎవరు?
అదే తిరుమలలో ఈ సిలువ గుర్తులు ఎవరు చెక్కుతున్నారు
ఇట్లాంటి వాటిని ప్రేరిపిస్తున్నది ఎ దండు నాయకులూ, ముల్లాలు మరి వాళ్ళు అందరు వీటిని కూడబలుక్కుని చేస్తున్నారా? ఎవరికి వారు తమ అభిప్రాయాలు చెబుతున్నారా? లేదా ఎప్పటి నుంచో తమ మస్తిష్కంలో గూడు కట్టుకున్న భావనలను ఇప్పడు బయటికి తీస్తున్నా రా?
వీరంతా రకరకాలుగా మాట్లాడినప్పటికీ వారి భావం మాత్రం ఒక్కటే. వారి మాటలు, ప్రకటనల్లో మతోన్మాదం చాలా స్పష్టంగా బయటపడుతున్నది.... ప్రపంచం లో ఉన్నది ఎలాగూ క్రిస్టియన్, ఇస్లాం ప్రబుత్వలె కాబట్టి వారి మాటలు చెల్లుబాటు అవుతున్నాయి అని అనుకుంటున్నారా ?
వ్యాసకర్త అంతిమంగా చెప్పిన ఈ క్రింది వాక్యంతో మాత్రం పూర్తిగా ఒప్పుకుంటా
“కానీ వారి ఉన్మాదం ప్రజాస్వామ్య భారతదేశంలో చెల్లదు కాక చెల్లదు.. ప్రజా కోర్టులో వీరికి కూడా శిక్ష పడి తీరుతుంది. ఇది సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర దేశం.”
No comments:
Post a Comment